Header Banner

టీచర్ల సంక్షేమానికి ముందడుగు! విద్యా రంగంలో పెనుమార్పులు! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Sun Mar 02, 2025 09:24        Education, Politics

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం-2025ను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్న నారా లోకేష్.. దీనిపై ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా.. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయులు మార్చి ఏడులోగా అభిప్రాయాలు తెలియజేయాలని నారా లోకేష్ కోరారు.

 

ఇది కూడా చదవండి: వైద్య పరీక్షలు పూర్తి.. రైల్వే కోడూరు కోర్టుకు పోసాని! ఆయన డ్రామా ఆడారు.. 

 

 

ఉపాధ్యాయుల బదిలీలు , ప్రమోషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియను వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జాబితాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే టీచర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన నారా లోకేష్.. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామన్న నారా లోకేష్.. త్వరలోనే బదిలీల ప్రక్రియ చేపడతామంటూ ట్వీట్ చేశారు.

 

ఇక ఉపాధ్యాయుల బదిలీల కోసం.. బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం- 2025 రూపొందించామన్న నారా లోకేష్.. ఈ ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను పంపాలని కోరారు.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ ముసాయిదా చట్టంపై తమ సలహాలు, సూచనలను draft.aptta2025@gmail.comకు మెయిల్ చేయాలని నారా లోకేష్ కోరారు. తన ట్వీట్‌లో డ్రాఫ్ట్ చట్టం డాక్యుమెంట్‌ను పంచుకున్న నారా లోకేష్.. సలహాలు సూచనలు మార్చి ఏడో తేదీ లోపు పంపాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇటీవల సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై సమీక్షించిన నారా లోకేష్.. టీచర్ల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్ష జరిపిన లోకేష్.. జీవో 117పై చర్చించారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్ షాప్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అలాగే డీఎస్సీ నిర్వహణపైనా అధికారులతో నారా లోకేష్ చర్చించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #education Here are five relevant hashtags in English: #TeacherTransfersAP #TransparentTransfers #EducationReforms #TeachersWelfare #APGovtInitiatives